కాశ్మీర్ అంశంపై చైనా మరోసారి అక్కసు..!

-

కాశ్మీర్​ విషయంలో భారత్​పై మరోసారి చైనా తన అక్కసు వెళ్లగక్కింది. రెండు దేశాల మధ్య విభేదాలను భారత్​, పాక్​ చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయని చెబుతూనే ఏకపక్ష మార్పులు అక్రమమని విషం చిమ్మింది. సంబంధాల బలోపేతం ద్వారా రెండు దేశాలు సంయుక్తంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కృషి చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. జమ్ముకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ఏడాది గడిచిన నేపథ్యంలో పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్​బిన్.

china barath
china barath

కశ్మీర్​ ప్రాంతంలో పరిస్థితిని చైనా నిశితంగా గమనిస్తోంది. ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉందని, ఇది రెండు దేశాల మధ్య చరిత్రకు సంబంధించిన వివాదం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, ఐక్యరాజ్యసమితి ఛార్టర్, భద్రతా మండలి తీర్మానాలు ఈ వాస్తవాన్నే వెల్లడిస్తు్న్నాయి. అయితే యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చటం అక్రమం అని భారత్​, పాక్ పొరుగుదేశాలు తెలుపుతున్నాయి. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్​బిన్​ అన్నారు. ఆర్టికల్​ 370 రద్దు విషయంలో పాక్​ కు వంత పాడుతూ వస్తోంది చైనా. భారత్ చర్య ఆమో​దయోగ్యం కాదని గతేడాది వ్యాఖ్యానించింది. ప్రస్తుతం భారత్​, చైనా మధ్య తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభన నేపథ్యంలో వాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news