ఇటలీ బోటు ప్రమాదం.. 59కి చేరిన మృతుల సంఖ్య

-

ఇటలీలో బోటు బోల్తా పడిన విషయం తెలిసిందే. అయోనియన్‌ సముద్ర తీరంలో శరణార్థుల పడవ ప్రమాదానికి గురై మరణించిన వారి సంఖ్య 59కు చేరుకుంది. ఘటనా సమయంలో బోటులో 100 మందికిపైగా వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 40 మంది ప్రాణాలతో బయటపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మృతుల్లో నెలలు నిండని శిశువు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బందితోపాటు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. టర్కీ, ఈజిప్టుల నుంచి శరణార్థులు వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ ప్రమాదం. కోస్టు గార్డ్, బార్డర్​ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చెందిన నౌకలు సహాయక చర్యలలో పాల్గొన్నాయని తెలిపారు. పడవపై వలస వచ్చిన వారు ఏ దేశస్థులో ఇంకా తెలియలేదని అన్నారు. పడవ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా ఇంకా తెలియలేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news