కెనడాలో జాగ్రత్తగా ఉండాలని భారత విద్యార్థులకు హెచ్చరిక..!

-

కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు హింసకాండను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు హెచ్చరించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్టు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణల నుంచి ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. కెనడా ప్రధాని భారత్ గురించి ఆ దేశ పార్లమెంట్ లో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమయ్యాయి.

ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత రాయబారిపై కెనడా నిషేదం విధించగా.. దానికి బదులుగా కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్.జే.శంకర్ ప్రధాని మోడీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-కెనడాల మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించేందుకు ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి భేటీ అయినట్టు తెలుస్తోంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడం పై కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం మధ్య విదేశాంగ మంత్రి ఎస్.జై.శంకర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం కెనడా అనుసరిస్తున్న తీరు.. ప్రపంచ దేశాల మద్దతు ఎలా కూడగట్టాలనే విషయాలతో పాటు పలు కీలకమైన అంశాలపై వారిరువురు చర్చించారు. ఇదే సమయంలో ఆ దేశంలో ఉంటున్న భారత పౌరులు, స్టూడెంట్స్ ని ప్రభుత్వం హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news