గాంధీ విగ్ర‌హ ధ్వంసంపై ట్రంప్ కామెంట్‌..

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను *బందిపోటు ముఠా* అని ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో గాంధీ విగ్ర‌హ ధ్వంసం ఘ‌ట‌న‌ను కూడా ప్ర‌స్తావించారు. చివరకు నిర‌స‌నకారులు వాషింగ్టన్‌ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు.

donald trump
donald trump

*వారు అబ్రహం లింకన్‌ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత వ‌ర‌కు అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు* అని ట్రంప్ అన్నారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ఆయ‌న‌‌ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్‌ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్‌నిర్మించినట్టు ట్రంప్‌ తెలిపారు.

అమెరికాలో శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ మే 25న జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్‌ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి రావ‌డంతో… దీనిపై అమెరికాలో నిర‌స‌న‌జ్వాల‌ ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news