ఐపిఎల్ 2023: గుజరాత్ ముందు భారీ లక్ష్యం… 219 !

-

ఐపిఎల్ లో ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. తద్వారా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్ లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. పవర్ ప్లే లో రోహిత్ మరియు ఇషాన్ లు 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయినా సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ను ముందుకు తీసుకు వెళ్ళాడు. చివరి వరకు ఔట్ కాకుండా జట్టుకు 218 పరుగుల భారీ స్కోరు ను సాధించి పెట్టాడు.

విష్ణు వినోద్ ఒకడే 30 పరుగులతో సూర్య కుమార్ కు చక్కని సహకారం అందించాడు. ఇక గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 30 పరుగులకు 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కాగా ఈ లక్ష్యాన్ని గుజరాత్ సాధిస్తుందా ? ఇప్పటికే 55 పరుగులకు 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news