ఐపీఎల్ 2023: గుజరాత్ ఛేజింగ్.. మ్యాచ్ పోటాపోటీ ఖాయం !

-

ఈ రోజు ముంబై మరియు గుజరాత్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే దాదాపుగా ప్లే ఆఫ్ కు చేరినట్లే, ముంబై గెలిస్తే ఒక ఆశ నిలిచి ఉంటుంది. కాగా ఈ మ్యాచ్ జరుగుతున్నది వాంఖడే స్టేడియం లో కావడం వలన మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పిచ్ పై ఏ జట్టు అయినా ఛేజింగ్ చేయాలనే అనుకుంటుంది. మొదట టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేపట్టనుంది. ఇక రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్, సూర్య , తిలక్ వర్మ, టీం డేవిడ్, గ్రీన్ లు కనుక చెలరేగి ఆడితే ముంబై ఖచ్చితంగా 200 పరుగులకు పైగానే లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచవచ్చు.

ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ కుదురుగా ఆడితే పరుగులు అవే వస్తాయి. మరి ముంబై మొదటి బ్యాటింగ్ లో ఎన్ని పరుగులు చేస్తుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news