ఐపీఎల్ 2023 : “ముంబై vs గుజరాత్” పోరులో గెలుపు ముంబైదేనా !

-

ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం ముంబై వేదికగా రోహిత్ మరియు హార్దిక్ పాండ్యాలు తమ తమ జట్లతో పోటీ పడనున్నాయి. ప్లే ఆఫ్ కు దగ్గర పడుతుండడంతో చివరి నాలుగు జట్లు ఏవో అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ప్రస్తుతం ఆడిన 11 మ్యాచ్ లలో ఆరు గెలిచి పాయింట్ లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక ఈ జట్టుకు మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఈ మూడు మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడినా మిగిలిన జట్ల ఫలితాల మీద ఆధారపడవలసి వస్తుంది. అందుకే గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ముంబై అన్ని విభాగాలలో బలంగానే ఉంది.

 

బ్యాటింగ్ లో రోహిత్ శర్మ మినహా అందరూ రాణిస్తున్నారు. కొత్తగా నెహాల్ అనే కుర్రాడు వరుస అర్ద సెంచరీలతో రాణిస్తున్నాడు. ఇక గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఛేజింగ్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఇటు జట్లలో ముందు టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ ముంబై కు గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news