ఐపీఎల్ 2023: ఈ రోజు వర్షం పడినా… మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం లేనట్లే !

-

నిన్న వర్షం భారీగా పడడంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రద్దయింది. దీనితో అభిమానులు నిరాశతో స్టేడియం నుండి వెళ్లిపోయారు. కాగా ఫైనల్ కు మాత్రమే రిజర్వు డే ను కేటాయించిన బీసీసీఐ ఈ రోజు మ్యాచ్ ను అదే సమయానికి నిర్వహించనుంది. ఈ రోజు వాస్తవారణ పరిస్థితులను అప్పుడే అభిమానులు ఆన్లైన్ లో చూసుకుంటూ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న విషయాన్ని క్లారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వాతావరణం గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో డ్రై గా ఉందట, కానీ మ్యాచ్ సమయానికి కానీ లేదా మ్యాచ్ మధ్యలో కానీ చిన్న పాటి జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది మ్యాచ్ రద్దయ్యే అంత ప్రమాదం కాదని వాతావరణ శాఖ తెలిపింది.

దీనితో మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకానికి అభిమానులు వచ్చారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలవనున్నారు అన్నది తెలియాలంటే మ్యాచ్ సమయం వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news