ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ పై వికెట్ తేడాతో ఢిల్లీ విజయం

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 256 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ కి ఓటమి ఎదురైంది. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. దీంతో 20ఓవర్లలో 247 రన్స్ కే పరిమితమైంది. తిలక్వర్మ(63 పరుగులు) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. కెప్టెన్ హార్దిక్(46 పరుగులు), టిమ్ (37 పరుగులు), సూర్య కుమార్ యాదవ్ (26 పరుగులు), ఇషాన్ కిషన్(20 పరుగులు) ఫరవాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ 4 వికెట్లు ,ఖలీల్, రసిక్ రెండేసి వికెట్లు తీశారు. ఇది ముంబై ఇండియన్స్ కి 6వ ఓటమి.

కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్స్ లో ఫ్రేజర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లో 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. మరో ఓపినర్ అభిషేక్ పోరెల్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు.హోప్ 17 బంతుల్లో 41 పరుగులు , కెప్టెన్ పంత్ 19 బంతుల్లో 29 పరుగులు, ట్రిస్తాన్ స్టాబ్స్ 48 పరుగులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news