IPL 2024 : గెలుపు కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మార్పులు!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 19వ మ్యాచ్ జరుగుతుంది.అయితే రాజస్థాన్తో మ్యాచ్లో బెంగళూరు టీమ్ పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన అనుజ్ స్థానంలో లోమ్రోర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే దినేశ్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే బౌలర్ రీస్ టోప్లీ ప్లేస్లో న్యూజిలాండ్ ఆటగాడు లాకీ ఫెర్గూసన్ను ఆడించనున్నట్లు సమాచారం. ఇక ఆల్ రౌండర్ మనోజ్ భాండగే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముంది.

కాగా, రాజస్థాన్లోని జైపూర్ వేదికగా 7: 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లోనూ విజయం సాధించగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకోగలిగింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుపు సాధిస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news