ప్రజలతో బాబుది అతకని బంధం : సీఎం జగన్

-

ప్రజలతో బాబుది అతకని బంధం అని  సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే. 2014 ఈ ముగ్గురు కూటమీగా ఏర్పడ్డారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చేశారా..? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ పథకం రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా..? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు చేశారా..? అని ప్రశ్నించారు.

పేదలను చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోడన్నారు. మీ బిడ్డ జగన్ పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాటిని అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంతాలు చేయడం తప్ప ప్రజల కోసం చేసేది ఏం లేదన్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ని నమ్మితే.. బంగారు కడియం-పులి కథనే గుర్తు పెట్టుకోండి అని సూచించారు. రాష్ట్ర భవిష్యత్ ను కాపాడుకునే యుద్ధంలో సిద్దమేనా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news