IPL Auction : సీనియ‌ర్లుకు వ‌రుస‌గా షాక్ ఇస్తున్న ఫ్రొంఛైజీలు

-

బెంగ‌ళూర్ వేదిక‌గా సాగుతున్న మెగా వేలంలో ఫ్రొంఛైజీలు సీనియ‌ర్ల‌కు వ‌రుస‌గా షాక్ ఇస్తున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌డంలో ఏ మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో ఎంతో అనుభ‌వం ఉన్న.. మేటీ ఆట‌గాళ్లు కూడా ఆన్ సోల్డ్ అవుతున్నారు. ఇప్ప‌టికే హార్డ్ హిట్ట‌ర్ సురేష్ రైనా కు షాక్ ఇవ్వ‌గా.. తాజా గా వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాద‌వ్, అమిత్ మిశ్రా ల‌ను కొనుగోలు చేయ‌డానికి ఫ్రొంఛైజీలు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌లేదు.

దీంతో వీరి ఆన్ సోల్డ్ అయ్యారు. అలాగే ప‌లువురు విదేశీ స్టార్ ఆట‌గాళ్లుకు కూడా ఫ్రొంఛైజీలు షాక్ ఇస్తున్నాయి. ఐపీఎల్ స్పిన్ తో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన ఇమ్రాన్ త‌హార్, ఆడ‌మ్ జంపా కూడా ఆన్ సోల్డ్ అయ్యారు. అలాగే మ‌హ్మ‌ద్ న‌బీ, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ హెడ్, ముజిబ్ ఉల్ రెహ్మ‌న్ ను కూడా కొనుగోలు చేయ‌లేదు. అయితే ఫ్రొంఛైజీలు కేవ‌లం యంగ్ స్టార్ ఆట‌గాళ్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. స్టార్ ఆట‌గాళ్లు అయినా.. వ‌య‌స్సు మీద ప‌డితే ఆన్ సోల్డ్ అవ‌డం జ‌రుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news