రాహుల్ మాట్లాడే భాష మావోయిస్టుల భాష వలే ఉంది: మోడీ

-

మావోయిస్టులు మాట్లాడే బాష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మోడీ విమర్శించారు. మావోయిస్ట్‌ భాష షెహజాదాలో మాట్లాడటంతో  కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

మే 19వ తేదీ ఆదివారం జంషెడ్‌పూర్‌ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పారిశ్రామిక వ్యతిరేక భాష షెహజాదాను అంగీకరిస్తారా లేదా అనే దానిపై కాంగ్రెస్, ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిలు సమాధానం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ.. తమ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిందని ,దాదాపు 18,000 గ్రామాల పరిస్థితి.. 18వ శతాబ్దానికి చెందిన గ్రామాల మాదిరిగా గత ప్రభుత్వ హయాంలో ఉండేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news