వైజాగ్ లో ఐపీఎల్ మ్యాచులు.. 24 నుంచి టికెట్ల అమ్మకాలు..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17  వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వైజాగ్ లో ఈ నెల 31, ఏప్రిల్‌ 3న ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్‌ 3న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం 24వ తేదీ నుంచి టికెట్లు కొనుక్కోవచ్చు.

అలాగే, ఈ నెల 31న చెన్నై సూపర్ కింగ్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టికెట్లు కొనుక్కునే అవకాశం కల్పించారు. పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల అమ్మకాలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. టికెట్ల ధరలు రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500, రూ.1,000గా ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news