రాష్ట్రంలో ప్రతి స్థానం కీలకమే: పవన్ కళ్యాణ్

-

మే 13న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండడంతో ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జనసేన కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంది . ఇందులో భాగంగా పి.గన్నవరం స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ పేరును జనసేననీ ప్రకటించింది.ఈ సందర్భంగా…జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పి.గన్నవరంలో కచ్చితంగా జనసేనే గెలుస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘స్థానిక ఎన్నికల్లో వైసీపీ వాళ్లు దౌర్జన్యాలకు పాల్పడి, కనీసం నామినేషన్ వేయనివ్వలేదు అని అన్నారు . అయినా సత్తా చాటాం. ఇదే స్ఫూర్తిని ఇప్పుడు చూపించాలి అని సూచించారు.రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news