తిరుమల టూర్ ప్యాకేజీ.. సులభంగా దర్శనం..!

-

ఈసారి మీరు తిరుమల కి టూర్ వేసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీ ని చూడాలసిందే. ఐఆర్‌సీటీసీ టూరిజం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో స్పెషల్ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. పంచదేవాలయం పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని అందిస్తున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కాణిపాకం, తిరుచానూర్, తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం ఈ ప్యాకేజీ తో కవర్ అవుతాయి. 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ఐదు దేవాలయాలను ఈ ప్యాకేజీ తో కవర్ అవుతాయి. తిరుపతి నుంచి ప్రతీ రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ఈ ప్యాకేజీ బాగా ఉపయోగ పడుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభం అవుతుంది ఈ ప్యాకేజీ. హోటల్‌లో చెకిన్ కావాలి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను చూడవచ్చు. లంచ్ తర్వాత శ్రీకాళహస్తి చూడవచ్చు.

రాత్రికి తిరుపతిలో స్టే చేయాలి. రెండో రోజు ఉదయం తిరుమలకు వెళ్ళాలి. ఉదయం 9 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో దర్శనం చేసుకోవచ్చు. తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళచ్చు. ఆ తర్వాత పర్యాటకుల్ని తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి ఎయిర్‌పోర్టు లో డ్రాప్ చేస్తారు. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,170. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,170, ట్విన్ షేరింగ్‌కు రూ.5,370 పే చేయాల్సి వుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version