సినీ పరిశ్రమలో బాలకృష్ణ ఒంటరి అయ్యారా…?

-

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. ఆయన హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారు అని అన్నది ఎవరిని అనేది ఇప్పుడు అర్ధం కాని పరిస్థితి. హైదరాబాద్ లో కూర్చుని భూములు పంచుకుంటున్నారు అని తొలిసారి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసారు. సినీ పెద్దలను అన్నారా లేక రాజకీయ నాయకులను అన్నారా అనేది అర్ధం కావడం లేదు.

ఇక తనను సమావేశానికి పిలవకపోవడం పై బాలకృష్ణ స్పందించిన తీరు కూడా సంచలనంగానే ఉంది. సాధారణంగా బాలకృష్ణ నిర్మాతల మండలి లో సభ్యులు దానికి తోడు ఆయన సినీ పరిశ్రమకు విరాళాలు కూడా భారీగా ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈ సమావేశానికి ఎందుకు పిలవలేదు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన కేవలం ఆర్టిస్ట్ అనే విధంగా వ్యాఖ్యలు చేసారు.

ఆయన ఆర్టిస్ట్ అయితే మరి చిరంజీవి కాదా…? నాగార్జున ఆర్టిస్ట్ కాదా…? ఇప్పుడు దీనిపైనే అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి. సినీ పరిశ్రమలో కోల్డ్ వార్ జరుగుతుందని బాలకృష్ణ ను దూరం పెట్టారు అని అంటున్నారు. ఒక సినీ పెద్దతో ఆయనకు విభేదాలు ఉన్నాయని కొందరు అంటుంటే కాదు 2018 ఎన్నికల్లో ఆయనను ఒక అధికార పార్టీ వ్యక్తి విమర్శించారు అని… ఆయనకు ఇష్టం లేకపోవడంతోనే బాలకృష్ణకు ఈ సమావేశానికి ఆహ్వానం రాలేదని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది ప్రచారం చేసే వాళ్ళకే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news