నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ 48 రాకెట్‌

-

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 50వ రాకెట్‌ ప్రయోగం కాగా.. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే మన దేశానికి చెందిన రీశాట్ 2 బీఆర్ 1 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

విదేశీ ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, ఇటలీ, ఇజ్రాయెల్, జపాన్ లకు చెందిన ఒక్కో శాటిలైట్ ఉన్నాయి. కాగా, ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ మంగళవారం ప్రారంభమైంది. కౌంట్‌డౌన్‌ పూర్తయిన వెంటనే బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రయోగించారు. ఇటలీ, ఇజ్రాయెల్‌, జపాన్‌కు చెందిన ఒక్కో, అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలను ఈ రాకెట్‌ వివిధ కక్ష్యల్లో వదిలిపెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news