ముంబైకి మకామ్ మార్చేస్తున్న చైతూ హీరోయిన్‌.. అందుకేనా..?

-

తెలుగు తెరపై అందాల కథానాయికగా మార్కులు కొట్టేసినవారిలో రాశి ఖన్నా ఒకరుగా కనిపిస్తుంది. పేరులోనే రాశిని పెట్టుకున్న ఈ భామ.. రాశి గల నటి అనే పేరు తెచ్చుకుంటోంది. అయితే ఇంకా స్టార్‌ ఇమేజ్‌ కోసం పోరాడాల్సి ఉంది. యువస్టార్స్‌తో జత కట్టే అవకాశాలే ఈ బ్యూటీ తలుపు తడుతున్నాయి. స్టార్స్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకోవలసి ఉంది. వాస్త‌వానికి కెరియర్ ఆరంభం నుంచి కూడా పెద్దగా హడావిడి పడిపోకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అప్పుడప్పుడు పలకరించే హిట్స్ తోనే ఇక్కడ కెరియర్ ను నెట్టుకొస్తోంది. ఆ మధ్య తెలుగులో కెరియర్ కాస్త ఆశాజనకంగా కనిపించడంతో, ‘గచ్చిబౌలీ’లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది.

అయితే ఆశించిన స్థాయిలో ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో, కోలీవుడ్ పై కూడా ఒక లుక్కేసింది. ఈ క్ర‌మంలోనే అక్కడ కూడా ఒక్కొక్కటిగా అవకాశాలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాశి ఖన్నా ముంబైకి మకామ్ మార్చేయాలనే నిర్ణయానికి వచ్చేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ‘గచ్చిబౌలి’లోని ఇంటిని కూడా ఆమె రెంట్ కి ఇచ్చేసిందని అంటున్నారు. ముంబైలో గట్టి ప్రయత్నాలు చేస్తూ, దక్షిణాది నుంచి వచ్చే అవకాశాలను కూడా అందుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుందట. కాగా, వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన సినిమా వెంకీమామ. ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. మ‌రియు ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదలకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news