శ్వేత విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు : దిగొచ్చిన బోండా అండ్ కో !

-

బోండా ఉమా నివాసానికి వచ్చిన కేశినేని శ్వేత అక్కడ బుద్దా వెంకన్న, బోండా, నాగుల్ మీరా తో శ్వేత భేటీ అయ్యారు. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు రఘురాంతో కలిసి వచ్చిన శ్వేతతో మాట్లాడాక బోండా ఉమా అండ్ కో కూల్ అయ్యారు. అధిష్టానం ప్రకటించిన మేయర్ అభ్యర్థి శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ కలిసి పని చేస్తామని, శ్వేత విషయం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని బోండా ఉమా ప్రకటించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ అచ్చెన్నాయుడు కి మా అభిప్రాయాలు చెప్పామని, శ్వేత అభ్యర్థిత్వాన్ని మేం ఎక్కడా వ్యతిరేకించలేదని అన్నారు.

రేపు చంద్రబాబు పర్యటన లో అంతా పాల్గొంటామని, పార్టీ లైన్ దాటే మనుషులం కాదని అన్నారు. విజయవాడ మేయర్ గా టీడీపీ అభ్యర్థి శ్వేత ను గెలిపిస్తామని మూడు నియోజకవర్గాల్లో ఆయా ఇంచార్జ్ లు…రేపు ప్రచారం లో పాల్గొంటారని అన్నారు. టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వెళ్తానని, పార్టీ నేతల మద్దతు తో కార్పొరేషన్ లో ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడయినా ఉంటాయని అన్నారు. వైసీపీ అన్ని విధాలా పాలనలో ఫెయిల్ అయ్యిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news