వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రధాని కావడం ఖాయం : ఎంపీ ధర్మపురి అర్వింద్

-

ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చాలామంది మన్ననలు పొందిన ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.ఆర్మూర్లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్ లో కొమరంభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ….. ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో, వచ్చేసారి ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని ఆయన అన్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లోనూ ఆర్మూర్ ఓటర్లు తనకు భారీ మెజార్టీ ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత లోక్ సభ ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని, పసుపు బోర్డు తీసుకురావడమే కాకుండా, రూ.20 వేల ధర అందేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారుకా. ఈ  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి, పార్లమెంట్ ప్రభారి వెంకటరమణి, ఆర్మూర్ ప్రభారి నందకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, జీవీ నర్సింహారెడ్డి, పాలెపు రాజు,పుప్పాల శివరాజ్, అమ్దాపూర్ రాజేశ్వర్ ,యామాద్రి భాస్కర్, మారంపల్లి గంగాధర్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news