ఐటీబీపీ సిబ్బందికి తృటిలో తప్పిన ప్రమాదం.. !

-

డెహ్రాడూన్ లో ఇండో టిబెట‌న్ బార్డర్ పోలీస్ ( ఐటీబీపీ ) సిబ్బందికి క్షణాల్లో పెను ప్రమాదం తప్పింది. ఒక బస్సులో జవాన్ సిబ్బంది వెళ్తున్న సమయంలో కెంప్టీ ఫాల్స్ సమీపంలో ఒక మూల మలుపు దగ్గర బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక హోటల్ లోకి దూసుకు వెళ్ళింది..

బస్సు ముందు భాగంలో ఉన్న టైర్లు లోయలోకి వెళ్లగా… బస్సు బాడీ మొత్తం కింద నేలకు తాకింది. దీంతో జవాన్లు అందరూ ఒక్క సరిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ ప్రమాదంలో జవాన్లకు ఎవరికి కూడా ఎటువంటి గాయాలు అవ్వలేదు, అంతేకాకుండా ఆ సమయంలో హోటల్లో కూడా సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఎవరికీ ఏ ప్రమాదం సంభవించలేదు. ఇక ఈ సంఘటన సమయంలో బస్సులో దాదాపు 20 నుంచి 30 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news