ఇండియా కుర్రాళ్ళ టాలెంట్ కి ఫిదా అయిపోయిన ఇవాంకా!

-

ఇటీవల అమెరికా నుంచి ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ భారత పర్యటనకు వచ్చి వెళ్ళారు. ఈ సందర్భంగా భారత్ లో పలు పర్యాటక ప్రదేశాలను వాళ్ళు చూసారు. గుజరాత్ లో సబర్మతి ఆశ్రమం, ఆగ్రాలోని తాజ్ మహాల్ ని వాళ్ళు సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఫ్యామిలీ దిగిన ఫోటోలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా ఇవాంకా ట్రంప్ దిగిన ఫోటో అయితే సోషల్ మీడియాలో ఒక ఒక అలజడి సృష్టించింది. ఆమెకు గ్లామర్ కాస్త ఎక్కువగా ఉండటంతో సింగల్ గా ఉండే కుర్రాళ్ళు అందరూ ఆమె తాజ్ మహాల్ వద్ద దిగిన ఫోటో ని మార్ఫ్ చేసి సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తున్నట్టు, ఇవాంకా ట్రంప్ తమ ఒడిలో కూర్చున్నట్టు ఒకరు ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వైరల్ చేసారు. ఈ ఫోటోలు తమ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు కుడా.

వాటికి మంచి స్పందన వచ్చింది. ఈ ఫొటోస్ ని ఇప్పుడు ఇవాంకా రీట్వీట్ చేయడం హైలెట్. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వాటిని పోస్ట్ చేసారు. నాకు కొంత ఫ్రెండ్స్ వచ్చారని, ఇండియా పీపుల్ ప్రతిభను తాను అభినందిస్తున్నా అంటూ ఆమె రీ ట్వీట్ చేసారు. మూడు ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో రావడంతో వాటిని మార్ఫ్ చేసిన వాళ్ళు ఇవాంకా మాకు ఫ్లాట్ అంటూ కామెంట్ చేసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news