ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన జబర్దస్త్.. ఇకపై కేవలం ఆరోజు మాత్రమే..!

-

గత కొన్ని వారాలుగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ షో జబర్దస్త్ రోజురోజుకు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కామెడీ ప్రియులకు మరొక షాక్ అందించింది జబర్దస్త్. జబర్థస్త్ ఈటీవీలో ప్రసారమవుతున్నప్పుడు ఇందులో అనసూయ యాంకర్ గా, రోజా, నాగబాబు న్యాయ నిర్ణేతలుగా వేణు, చమ్మక్ చంద్ర, ధనరాజు లాంటి వాళ్ళతో జబర్దస్త్ కామెడీ షో ను 2013లో మొదలుపెట్టారు. అది కూడా గురువారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రారంభం అయ్యేది. ఇక జబర్దస్త్ మొదట్లో టాప్ టిఆర్పి తో అదిరిపోయే సక్సెస్ నైతే బాగా అందుకుందని చెప్పవచ్చు. ఇక ఈ షోని ఆదరించేవారు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యం లో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అనసూయ కూడా యాంకర్ గా భారీగా రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేసింది.

దీంతో స్మూత్ గా అనసూయను తప్పించి, ఆ స్థానంలోకి రష్మీ నీ తీసుకొచ్చి అనసూయకు షాక్ ఇచ్చింది మల్లెమాల. ఇక తర్వాత మల్లెమాల నిర్మాతలకు, అనసూయకు మధ్య డీల్ ఎలా కుదిరిందో తెలియదు కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ అని మరొక ప్రోగ్రాంను స్టార్ట్ చేసి గురువారం రాబోయే జబర్దస్త్ కి అనసూయను, శుక్రవారం రాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కు రష్మీ ని యాంకర్ గా మార్చారు. ఇక 2015 నుంచి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ బాగా దూసుకుపోయాయి.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ఇక రెండు రోజులపాటు జబర్దస్త్ రాకపోవచ్చు అని, ఆ షో నుండి బయటకు వచ్చిన ఒక కమెడియన్ తెలిపారు.

సుధీర్, అభి, ఆది లాంటి టీం లీడర్లు బయటకు వచ్చిన తర్వాత స్కిట్స్ చేయడానికి సరైన టీం లీడర్స్ ఎవరూ లేకపోవడం, దాంతో స్పెషల్ స్కిట్స్, సీరియల్ ఆర్టిస్టులు స్కిట్స్ అంటూ జబర్దస్త్ ను ముందుకు నెడుతున్నారు. ఇక ఇంకొకపక్క పర్మినెంట్ గా న్యాయ నిర్ణేతలు గా ఎవరు దొరకడం లేదు. దీంతో ఈ రెండు రోజుల షో ని కేవలం ఒక్కరోజుకి మాత్రమే కుదించి.. ఒక ఎపిసోడ్ కి సరిపోయే స్కిట్స్ ను పర్ఫెక్ట్ గా చేయాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఇకపై ఒక రోజు మాత్రమే జబర్దస్త్ రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news