మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్‌

-

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పాటియాలా హౌస్‌ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేసులో జాక్వెలిన్ పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 26న కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నటికి సమన్లు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్‌ సోమవారం పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే బెయిల్‌ కోసం నటి తరఫు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఈడీ నుంచి స్పందన కోరింది.

రెగ్యులర్‌ బెయిల్‌ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని జాక్వెలిన్‌ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. రూ.50వేల పూచికత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news