ఏపీ విద్యుత్ శాఖ ఉద్యోగులకు జగన్ శుభవార్త..పెండింగ్ డీఏలు చెల్లింపు

-

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ లో ఉన్న డీఏ చెల్లించాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయ తీసుకున్నట్లు ప్రకటన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఉద్యోగులకలు పెండింగ్‌ డీఏలను చెల్లించేలా ప్రభుత్వం ఉత్వర్వులిచ్చిందని… ఈ ఉత్తర్వులను విద్యుత్‌ రంగంలోని సిబ్బందికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించిందన్నారు.

jagan
jagan

దీని ప్రకారం.. పెండింగ్‌ లో ఉన్న 4 డీఏలను విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి అమల్లో ఉన్న పీఆర్సీ ఉత్తర్వులు మార్చి 31తో ముగుస్తాయన్నారు. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ పై వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీ పై వారు ఎలా స్పందిస్తారో.. కమిటీ ఏం నివేదిక ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లేందుకు సన్నద్ధం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news