జగన్ మరో శుభవార్త.. టిడ్కో ఇళ్లపై కీలక ప్రకటన

-

పేదలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లపై సభలో చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ కి సంబంధించి లబ్ధిదారుల వాటాలో సీఎం జగన్ మరిన్ని రాయితీలు ప్రకటించారు. 365 చదరపు అడుగులకు సంబంధించి లబ్ధిదారుడు కట్టాల్సిన రూ.50 వేలల్లో రూ.25 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన చేశారు.

ys jagan Good News For unemployed
ys jagan Good News For unemployed

అలానే 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లకు సంబంధించి లబ్ధిదారుడు కట్టాల్సిన లక్ష రూపాయల్లో రూ.50 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన చేశారు. అలానే 300 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్లను పేదలకు ఒక్క రూపాయికే ఇస్తామన్న సీఎం, పేదలకు కట్టనున్న ఇంటి నమూనాలను వీడియో ద్వారా చూపించారు. ఇళ్ల స్థలాల పట్టాలపై కోర్టులో కేసులు వేసిన టీడీపీ కార్యకర్తల ఫొటోలను కూడా అసెంబ్లీలో స్క్రీన్‌పై చూపించారు సీఎం జగన్. 

Read more RELATED
Recommended to you

Latest news