బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే ఆరుగురు మృతి

-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోర్వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ తో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

బోర్వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీ కొట్టి నట్టు చెబుతున్నారు. అయితే నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. ఈ మృతులు అందరూ సికింద్రాబాద్ తాడ్ బండ్ కు చెందిన వారు అని అంటున్నారు. ఇక మరో పక్క ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో కూడా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతులు ముగ్గురు కూడా గ్రామస్తులుగా గుర్తించారు పోలీసులు. 

Read more RELATED
Recommended to you

Latest news