ఏపీ ఉద్యోగులకు జగన్ శుభవార్త.. పెన్షన్ అమలుపై కీలక ప్రకటన

-

ఏపీ ఉద్యోగులకు జగన్ శుభవార్త చెప్పారు.2004 కంటే ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.  సెప్టెంబరు 1 తేదీ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి పాతపెన్షన్ వర్తింప చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ శాఖలన్నీ 2004 సెప్టెంబరు 1 తేదీ నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరిన ఆర్ధిక శాఖ…ఈ నెల 14 తేదీన సచివాలయంలో దీనికి సంబంధించిన వివరాలతో సమావేశానికి హాజరు కావాల్సిందిగా హెచ్ఓడి కార్యాలయాల్లోని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

 

2004 సెప్టెంబరు 1 తేదీ కంటే ముందుగా చేరిన ఉద్యోగుల సంఖ్య 6510గా తెలిపిన పాఠశాల విద్యాశాఖ…. 2003 డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్ 2 బ్యాచ్ ఉద్యోగులకు లబ్ది కలిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పై ఉద్యోగులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news