జగన్ కుంభకర్ణుడు, ఆరు నెలల ముందు నిద్ర లేచాడు : వైఎస్ షర్మిల

-

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల….జగన్ కుంభకర్ణుడని, ఆరు నెలల ముందు నిద్ర లేచాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివేకాను హత్య చేసినవారు యథేచ్ఛగా తిరుగుతున్నారని, ఆధారాలున్నప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని, హత్య చేసినవాడినే గెలిపించాలని అనుకుంటున్నాడని మండిపడ్డారు.

వివేకాను హత్య చేసినవారా, వైఎస్సార్ బిడ్డనా తేల్చుకోవాలని, తండ్రిలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వైఎస్ షర్మిల తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే, మేనమామ రవీంద్రారెడ్డి కేసులపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుండి వచ్చానని తనపై కామెంట్ చేస్తున్నారని, అక్కడ కేసీఆర్ ను ఓడించానని, ఆంధ్ర ప్రదేశ్ లో కొంచెం పని ఉండి వచ్చానని అన్నారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news