‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్…

-

తెదేపా ప్రభుత్వం గత నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అవినీతి కార్యక్రమాలపై  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ‘అవినీతి చక్రవర్తి 6,17,585.19 కోట్లు’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆదివారం ఉదయం  ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించే ముందు ఈ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ నాలుగేళ్లలో బాబు దోచుకున్నదంతా ఈ పుస్తకంలో పొందుపరిచామన్నారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, ఎంపీలకు పంపిస్తామన్నారు. రూ.6క్షల 17వేల 585 కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడినట్లు పూర్తి  స్థాయి సమాచారంతో లెక్కలతో సహా ఇందులో వివరించినట్లు తెలిపారు.

గత ఏడాది నవంబర్‌ 30 వరకు చంద్రబాబు అవినీతిని పుస్తకంలో ప్రస్తావించామన్నారు. అవినీతికి సంబంధించి జీవోలు, సాక్ష్యాధారాలతో సహా వివరించామన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భూమన, తమ్మినేని, కళావతి, శ్రీనివాసరావు, సాయిరాజ్‌, రెడ్డిశాంతిలు పాల్గొన్నారు. త్వరలో ప్రజా సంకల్ప యాత్ర ముగియనున్న నేపథ్యంలో జగన్ తనదైన శైలిలో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని ఇక ఎన్నికల రణ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news