ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ

-

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిశా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న ఏపీ సీఎం, చర్చలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమయం కోరారు. నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశా రైతులకు లబ్ధి చేకూరుతుందని లేఖలో  సీఎం జగన్ పేర్కొన్నారు. 

jagan

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు, ఒడిషాలోని గజపతి జిల్లా ఉపయుక్తంగా ఉంటుందన్న ఏపీ సీఎం ఏపీ-ఒడిషా రైతులకు ఉపయోగ పడేలా నేరడి బ్యారేజ్ నిర్మాణం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సముద్రంలోకి వృధాగా పోయే 80 టీఎంసీల నీటిని నేరడి బ్యారేజీ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తేవచ్చని ఏపీ సీఎం లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version