సీతారామశాస్త్రి హాస్పిటల్‌ బిల్‌ను కట్టిన జగన్ సర్కార్‌ !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. గత నెల 24వ తేదీన… లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి… నిన్న సాయంత్రం సరిగ్గా నాలుగు గంటల సమయంలో స్వర్గస్తులయ్యారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో కి వెళ్ళింది. అయితే ఆయన చికిత్స పొందిన ఆసుపత్రి బిల్లును జగన్మోహన్రెడ్డి సర్కార్ కట్టింది.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన గొప్ప కవి మృతికి సంతాపంగా… ఆయన ఆస్పత్రి ఖర్చులు భరించడం కనీస బాధ్యతగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అందుకే… ఇప్పటివరకు సిరివెన్నెల కుటుంబం కట్టిన బిల్లుతో సహా… అన్ని బిల్లులను జగన్మోహన్రెడ్డి సర్కార్ చెల్లించింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఏపీ ప్రభుత్వానికి తాము ఎప్పుడు రుణపడి ఉంటామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో.. మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news