చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌రో షాక్‌.. సినిమా టికెట్లపై జ‌గన్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… సినిమా టికెట్లు ఉన్నాయి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ద్వారానే… ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయని స్పష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఇందులో భాగంగానే చట్ట సవరణ జీవోలు 142 ను జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

ఆన్లైన్ సినిమా టికెట్ల మన బాధ్యత ఏపీ ఎఫ్ డి సికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఐ ఆర్ సి టి సి త్వరలోనే ప్రభుత్వ ప్రత్యేక వ్యవస్థ దీనికోసం ఏర్పాటు జీవోలో పేర్కొంది. ప్ర‌భుత్వ‌మే.. టికెట్ల‌ను అమ్మితే.. ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగ‌వ‌నే నేప‌థ్యంలోనే.. ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా.. గ‌త కొన్ని రోజుల నుంచి… సినిమా టికెట్ల పై చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం కొన‌సాగుతూనే ఉంది. సినిమా టికెట్ల‌ను ఆన్ లైన్ చేసినప్ప‌టికీ… టికెట్ల ధ‌ర‌ల‌ను మాత్రం పెంచాల‌ని చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి డిమాండ్ వ‌స్తుంది. అయితే.. దీనిపై జ‌గ‌న్ స‌ర్కార్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news