చంపేది చంద్రబాబే.. మొసలికన్నీరు కార్చేది ఆయనే – సీఎం జగన్

-

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, ఎల్లో మీడియాపై మరోసారి సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపేది చంద్రబాబే.. మొసలికన్నీరు కార్చేది ఆయనే అంటూ సీఎం జగన్ చురకలు అంటించారు.
చంద్రబాబుకు తెలిసింది ఫొటోషూట్లు, డ్రోన్‌షాట్లు, డ్రామాలు.. సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో డ్రోన్‌ షాట్ల కోసం 29 మందిని చంపేశారని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌.

కందుకూరులో జనాన్ని ఎక్కువ చూపించేందుకు చిన్న సందులో ప్రజల్ని నెట్టారు, తన డ్రోన్‌ షాట్లు, ఫొటో షూట్ల కోసం 8 మందిని చంపేశారని ఆరోపించారు. తన ప్రచారం యావ కోసం చంద్రబాబు సభలు, పుష్కరాల్లో ప్రజలను బలితీసుకున్నా, పచ్చ మీడియా ఆయన్ను మానవతావాదిలా కీర్తిస్తుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ‘మనుషులను చంద్రబాబు చంపేసిన ఈనాడు, ABN, TV 5 దత్తపుత్రుడు అడగరు, మాట్లాడరు, ప్రశ్నించరు. చంద్రబాబు తప్పు చేసి పోలీసులదే తప్పు అంటాడు. కందుకూరిలో 8 మంది చనిపోయిన, దాహం తీరనట్లు గుంటూరులో మరో ముగ్గురిని బలి తీసుకున్నాడు’ అని సీఎం విమర్శల వర్షం కురిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news