బలహీన వర్గాలకు జగన్ దిక్సూచి – ఎంపీ భరత్

-

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు ఎంపీ మార్గాని భరత్ రామ్. చంద్రబాబు హయాంలో వెనకబడిన వర్గాలకు 30 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని, పదవులలో బలహీనవర్గాలకు 68% అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.

బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకున్నారని ఆరోపించారు ఎంపీ భరత్. చంద్రబాబుది పెత్తందారీ వ్యవస్థ విధానమని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ దిక్సూచి అని.. ఆయన గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్ కి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news