కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు.. జగ్గారెడ్డి సంచలనం

-

ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే.. కేసీఆర్ కి ఇబ్బందే అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పోటీీ ఉంటుందని.. బీజేపీకి ఓట్ బ్యాంక్ రాలేదని అన్నారు. బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ నిరసన ప్రోగ్రాం తనకు తెలియదని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు చెప్పిచేయాలనే రూల్ లేదని జగ్గారెడ్డి అన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి- రేవంత్ రెడ్డి కలవడం మంచి పరిణామం అని ఆయన అన్నారు. నేను ఎక్కువ సమయం నియోజకవర్గానికి సమయం కేటాయించాలని అనుకుంటున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలపై కూడా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకోవడంలో తప్పేం ఉందని… దానికి నిరుద్యోగానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news