టీఆర్ఎస్ పార్టీలోకి జగ్గారెడ్డి.. క్లారిటీ ఇదే !

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి ముసలం నెలకొంది. నిన్నటి నుంచి.. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడను ఉన్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం కార్యకర్తలతో మాట్లాడి టిఆర్ఎస్ పార్టీలో జగ్గారెడ్డి చేరతారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో కి వెళ్ళ బోనని.. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లాలంటే రెండేళ్ల క్రితమే వెళ్లేవాణ్ని అంటూ జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. తాను ఏమైనా టిఆర్ఎస్ కోవర్టునా ? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. పిసిసి అధ్యక్షుడి పద్ధతి అస్సలు బాగాలేదని.. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. దీనిపై రాహుల్ గాంధీ అలాగే సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news