టిఆర్ఎస్ కండువా కప్పుకున్న జగ్గారెడ్డి, విహెచ్.. ఫోటోలు వైరల్ !

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో… గ్రూప్ వివాదాలు కొత్తేమీ కాదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి… కాంగ్రెస్ పార్టీలో మరిన్ని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో… జగ్గారెడ్డి, వి హనుమంత రావు పై విచ్చలవిడిగా రాతలు కూడా రాస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వి.హనుమంతరావు, జగ్గారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు.. కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు పోస్ట్ చేశారు.

అంతేకాదు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మరి ఫొటోలు వైరల్ చేశారు కొందరు సోషల్ మీడియా వారియర్స్. అయితే దీనిపై… తాజాగా బి హనుమంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వి.హనుమంతరావు… సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు, జగ్గారెడ్డికి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పోస్ట్ చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news