బీజేపీ అనే మర్రిచెట్టు నాల్గవ కొమ్మ షర్మిల పార్టీ !

-

 షర్మిల పొలిటికల్ ఎంట్రీ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని అనుకుంటున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలసి పనిచేయవచ్చు కదా ? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అనే మర్రిచెట్టు నాల్గవ కొమ్మ షర్మిల పార్టీ అని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి తప్పు చేస్తున్నారన్న ఆయన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఈ ప్రయత్నాల చేస్తున్నారని అన్నారు.

jagga-reddy
jagga-reddy

విభజన తర్వాత ఈ పార్టీల లొల్లి ఎందుకు… ? ఉమ్మడి రాష్ట్రం చేసేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి స్క్రిప్ట్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నారని, కేసీఆర్ వైఎస్ షర్మిల పార్టీపై ఎందుకు మాట్లాడడం లేదు ? ఆయన నోరు ఏమైనది ? అని అయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఏమైనా పొలిటికల్ టూరిస్ట్ స్పాటా ? అని ప్రశ్నించిన అయన కేసీఆర్, వైఎస్ జగన్,పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలలు అమిత్ షా బాణాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news