జగ్గూ భాయ్‌ నీ బాబాయ్‌ ని ఎవరు చంపారో.. ఇంకా అర్థం కాలేదా : చంద్రబాబు

-

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాగళం వేదికగా ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో కూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని అన్నారు.

ఈ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా జగన్ పనైపోయిందని అన్నారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి మోదీ భరోసా ఇచ్చారని, రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని తెలిపారు. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో.. మోదీ, అమిత్‌షా చెప్పారని పేర్కొన్నారు.”జగ్గూ భాయ్‌ నీ బాబాయ్‌ (మాజీ మంత్రి వివేకానందారెడ్డిని) ఎవరు చంపారో.. ఇంకా అర్థం కాలేదా” అని చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news