పునీత్ ‘జేమ్స్’ జాతర షురూ.. వారం రోజుల ముందే టికెట్స్ ఖతం

-

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఇటీవలే.. మరణించిన సంగతి తెలిసిందే. జిమ్‌ చేస్తూ.. గుండెపోటుకు గురైన పునీత్‌ రాజ్‌ కుమార్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదం లో కి వెళ్ళింది. ఆయన మృతి వార్తను ఇప్పటికి ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌ గా నటించారు. అలాగే చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పునీత్‌ జయంతి సందర్భంగా అంటే మార్చి 17 వ తేదీన ఈ సినిమా విడు దల కానుంది. అయితే.. సినిమా విడుదలకు 4 రోజులు ఉండగానే.. ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది జేమ్స్‌ మూవీ. జేమ్స్‌ సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సినిమా కర్ణాటకలో విడుదల అవుతోంది.

ఈ సినిమా బుకింగ్స్‌ వారం రోజుల ముందే మొదలు పెట్టారు. అలా ఓపెన చేసిన కొన్ని గంటల్లోనే మొదటి మూడు రోజుల టికెట్స్‌ అన్ని అయిపోయాయి. కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఎలాగైనా పవర్‌ స్టార్‌ సినిమా మొదటి రోజు చూసేయాలని ఉత్సాహంగా కనిపిస్తున్నారు అభిమానులు.

 

Read more RELATED
Recommended to you

Latest news