Breaking : న్యూయర్ వేళ కాశ్మీర్ లో ఘోర విషాదం..12 మంది మృతి…!

-

కొత్త సంవత్సరం వేళ జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఆలయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో ఒకరిని ఒకరు నెట్టు కోవడం వల్ల తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ డిజిపి దిల్ బాగ్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news