జనసేన కౌలు రైతు భరోసా యాత్ర..అనంత నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన షురూ..

-

“కౌలు రైతుకు భరోసా” ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థిక సాయం అందించేందుకు నడుంబిగించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.ఇవాళ అనంతపురం జిల్లా నుండి కౌలు రైతుల భరోసా యాత్రను ప్రారంభించారు జనసేనాని.ఈరోజు ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. అక్కడి నుండి కొత్తచెరువు గ్రామానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా కౌలు రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకె రామకృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

భార్య సాకే సుజాతకు 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఆయన వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, వరుణ్, చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.ఇక్కడి నుండి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.అక్కడి నుండి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు కి చేరుకొని ఆత్మహత్య చేసుకున్న మరో కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news