ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్…. మీ స్నేహితురాలిని పిలిస్తే నిన్ను వదిలేస్తామని చెప్పి… చివరకు

-

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందుగా ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టగా… బాలిక స్నేహితురాలిని పిలిపించి మరోసారి ఇద్దరిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కామాంధుల చెర నుంచి రాత్రి తప్పించుకున్న బాలికలు గురువారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…. జార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలోని దుర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధిత బాలిక వదిన పొరుగింటిలో ఉన్న యువకుడితో బయటకు పంపింది. మార్గం మధ్యలో ఆ యువకుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత అతని స్నేహితులను మరో ఐదుగురికి కాల్ చేసి పిలిచారు. వారు వచ్చిన తర్వాత బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఎంత ప్రాధేయపడిన కామాంధులు విడవలేదు. కాగా… మీ స్నేహితురాలిని ఫోన్ చేసి రమ్మంటే నిన్ను విడిచిపెడతాం అని మాయమాటలు చెప్పడంతో నమ్మిన బాలిక తన స్నేహితురాలిని పిలిచింది. మరో బాలిక కూడా వచ్చిన తర్వాత ఇద్దరు బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news