ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు… సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి..

-

అమరావతి : ఏపీలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందిద. ఏపీలో పలువురు ఐఏఎస్‌ల ను బదిలీలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.

ప్రస్తుతం అడిషనల్ ఈఓగా ఉన్న ధర్మా రెడ్డి… టీటీడీ ఈఓగా ఉన్న జవహర్ రెడ్డిని రిలీవ్ చేసింది జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. ఇక నుంచి సీఎం కార్యాలయం స్పెషల్ సీఎస్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతల్లో కొనసానున్నారు జవహర్ రెడ్డి.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్.డి. గా ఎస్. సత్యనారాయణ పని చేయనున్నారు. సెర్ప్ సీఈఓగా ఉన్న ఎమ్. డి. ఇంతియాజ్ మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. త్వరలోనే ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చేపట్టనున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news