ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ మేనేజర్ Gr-II/సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేస్తోంది.

ఇక జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇందులో మొత్తం 93 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 43 అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం అప్లై చెయ్యచ్చు.

వయస్సు గురించి చూస్తే.. అభ్యర్థులు ఏప్రిల్ 12, 2022 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ. 44,900 నుంచి రూ. 1,42,400 వరకు జీతం పొందుతారు.

ఇక అర్హతల వివరాల లోకి వెళితే.. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. కామర్స్ / లా / మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇస్తారు. అలానే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అభ్యర్థులు వ్రాత పరీక్ష, నైపుణ్యాలు, వివరణాత్మక పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ / OBC అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2022.

Read more RELATED
Recommended to you

Latest news