నేటి నుంచే హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం…తక్కువ ధరకే ప్లాట్లు !

-

ఇవాల్టి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బహదూర్ పల్లి, తొర్రూరు లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ని ఫ్లాట్లను… ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ ప్రక్రియ ఇవాల్టి నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ప్లాట్ల విక్రయాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎంటీఎస్ లిమిటెడ్ ఈ- యాక్షన్ ఏర్పాట్లు చేసింది హెచ్ఎండిఎ.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లి లో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లేఅవుట్ లో 101 ప్లాట్లు, తొర్రూరు లో 117 ఎకరాలు అభివృద్ధి చేసిన లేఅవుట్ లో 223 ప్లాట్లను మొదటి దశలో విక్రయిస్తున్నారు. అలాగే ఈ ప్లాట్ల చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను బహదూర్ పల్లిలో 25 వేల రూపాయలు గా, అలాగే తొర్రూరులో రూ. 20000 గా నిర్ణయించారు. చదరపు గజానికి కనీసం బిడ్ పెంపుదలను 500 రూపాయల చొప్పున పెంచాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news