ఓటీటీ లోకి వచ్చేసిన జోరమ్ సినిమా..!

-

మనోజ్ బాజ్పేయి నటించిన జోరమ్ సినిమా డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి పలు అంతర్జాతీయ ఫిలింస్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవాశీష్ మాకీజా దర్శకత్వం వహించారు ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి ఈ మూవీ సిద్ధమైంది.

ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టిన ఈ సినిమా హిందీలో స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.199 రెంట్ తో అందుబాటులోకి ఉంది ఈ సినిమా చూడాలంటే ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉన్నవారు కూడా ఆ మొత్తాన్ని చెల్లించి చూడాలి. కొంతకాలం తర్వాత సబ్స్క్రైబర్లు ఫ్రీగా సినిమాని చూడవచ్చు. ఈ సినిమాలో వలస కార్మికుడిగా మనోజ్ బాజ్ పేయి అద్భుతంగా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news