ఈ నెల 16న తెలంగాణకు జేపీ నడ్డా

-

కేంద్రంలోని బిజెపి ఈసారి దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ చేస్తుందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాగా వేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందా? 2024 ఎన్నికల లక్ష్యంగా బిజెపి దృష్టి సారించిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. తెలంగాణపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యంలో జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 16వ తేదీన తెలంగాణకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత పాదయాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బిజెపి నేతలు ప్లాన్ చేస్తున్నారు. జేపీ నడ్డా షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news